చంద్రబాబు బినామీల కోసమే నకిలీ పోరాటం

రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్‌ పోరాడుతుంటే.. తన బినామీల కోసం చంద్రబాబు నకిలీ పోరాటం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు.

Updated : 05 Oct 2022 05:30 IST

మంత్రి రోజా ఆరోపణ

తణుకు, న్యూస్‌టుడే: రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్‌ పోరాడుతుంటే.. తన బినామీల కోసం చంద్రబాబు నకిలీ పోరాటం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒంగోలు జాతి వృషభరాజ బల ప్రదర్శన పోటీల సందర్భంగా మంగళవారం ఆమె హాజరై మాట్లాడారు. మూడు రాజధానులతో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని విజయదశమినాడు ప్రతి ఒక్కరూ ఆలయాలకు వెళ్లి దేవుణ్ని ప్రార్థించాలని కోరారు. త్వరలో నిర్వహించనున్న తన జన్మదిన వేడుకల్లోనూ ఒంగోలు జాతి వృషభరాజ పోటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పుంగనూరు, ఒంగోలు జాతి ఎద్దుల బండ్లపై సందడి చేశారు. ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి, శెట్టిబలిజ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ తమ్మయ్య, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని