అల్లర్లు జరిగితే అయ్యన్నే బాధ్యుడు
‘అమరావతికి మేం వ్యతిరేకం కాదు, అమరావతితో పాటు విశాఖపట్నం పాలనా రాజధానిగా అభివృద్ధి చెందాలన్నదే మా అభిమతమ’ని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు.
నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్
నర్సీపట్నం అర్బన్, న్యూస్టుడే: ‘అమరావతికి మేం వ్యతిరేకం కాదు, అమరావతితో పాటు విశాఖపట్నం పాలనా రాజధానిగా అభివృద్ధి చెందాలన్నదే మా అభిమతమ’ని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. మంగళవారం మీడియాకు పంపిన వీడియోలో ఆయన మాట్లాడుతూ ‘అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రకు చేరినప్పుడు గూండాలతో విధ్వంసం సృష్టించాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రణాళిక రూపొందించారు. ఆయన ఎంతమందితో వచ్చినా మేం వేల మందితో అడ్డుకుంటాం. అల్లర్లు జరిగితే అయ్యన్నే బాధ్యత వహించాలి’ అని పేర్కొన్నారు. ‘మూడు రాజధానులకు మద్దతుగా ఇప్పటికే గ్రామాల్లో సీఎం జగన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశాం. దసరా రోజున ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తాం. ఈ నెల 7 నుంచి మండలాల్లో బైకు ర్యాలీలు చేపడతాం. 17న నియోజకవర్గ స్థాయిలో ర్యాలీ నిర్వహిస్తామ’ని ఎమ్మెల్యే గణేష్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?