ఇతరులతో పనిలేకుండా జగన్‌ని చూసే ఓటేయండి: వైకాపా ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి

ముఖ్యమంత్రి జగన్‌ని చూసే ఓటెయ్యాలని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఇతరులతో పని లేకుండా... మనసులో ఏ ఇతర ఆలోచన పెట్టుకోకుండా వైకాపాకు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.

Updated : 05 Oct 2022 07:57 IST

వల్లూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ని చూసే ఓటెయ్యాలని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఇతరులతో పని లేకుండా... మనసులో ఏ ఇతర ఆలోచన పెట్టుకోకుండా వైకాపాకు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. వైయస్‌ఆర్‌ జిల్లా వల్లూరు మండలం గంగాయపల్లెలో మంగళవారం వైయస్‌ఆర్‌ చేయూత కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ‘పుల్లయ్య పార్టీలో ఉండాడు... నాకు పుల్లయ్యతో సరిపోదు.. అందుకే వైకాపాకు కాకుండా మరో పార్టీకి ఓటేస్తాననే ఆలోచన తీసుకురావద్దని’ హితవు పలికారు. గొప్ప పరిపాలన అందిస్తున్న జగన్‌ను మరో పాతికేళ్లు ముఖ్యమంత్రిగా ఉండేలా ఆశీర్వదించాలని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కోరారు. మండలంలో 1,300 మంది లబ్ధిదారులకు మంజూరైన చేయూత నిధుల చెక్కులను పంపిణీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని