బీసీలకు అండగా తెరాస: మంత్రి కేటీఆర్
ప్రభుత్వం బీసీలకు అన్ని విధాలా అండగా ఉందని, వారి అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలుస్తోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు తెలిపారు.
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వం బీసీలకు అన్ని విధాలా అండగా ఉందని, వారి అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలుస్తోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు తెలిపారు. తెలంగాణ బీసీ సంఘాల ఐకాస ఛైర్మన్, పీసీసీ అధికార ప్రతినిధి ఓరుగంటి వెంకటేశంగౌడ్, ఇతర నేతలు కేటీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు.ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, సబ్బండవర్గాల అభ్యున్నతే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. విపక్ష పార్టీలు బీసీలను ఓటుబ్యాంకుగా భావిస్తుండగా వారిని తెరాస ఆత్మబంధువుల్లా భావిస్తూ ఆదుకుంటోందన్నారు. వెంకటేశంగౌడ్ మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో సామాజిక న్యాయం జరుగుతోందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!