అది దండయాత్ర

అమరావతి రైతులు చేస్తున్నది పాదయాత్ర కాదు దండయాత్ర అని ఉమ్మడి విశాఖ జిల్లా వైకాపా సమన్వయకర్త, తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు.

Published : 07 Oct 2022 02:28 IST

తితిదే ఛైర్మన్‌ వై.వి. సుబ్బారెడ్డి

విశాఖపట్నం, న్యూస్‌టుడే: అమరావతి రైతులు చేస్తున్నది పాదయాత్ర కాదు దండయాత్ర అని ఉమ్మడి విశాఖ జిల్లా వైకాపా సమన్వయకర్త, తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. గురువారం విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైకాపా కార్యాలయాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. అమరావతి రైతులపై ఉన్నవి పచ్చరంగు చొక్కాలని, వారికి ఆర్థికసాయం చేస్తూ నడిపిస్తున్నది మాత్రం పసుపు చొక్కాలని ఆరోపించారు. గ్రామాల పేరు చెప్పి దండయాత్రకు వస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని