పీసీసీ ఉపాధ్యక్ష పదవికి మల్లు రాజీనామా

కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడానికే కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశారని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు.

Published : 07 Oct 2022 04:52 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడానికే కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశారని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మల్లికార్జునఖర్గేకు మద్దతుగా ప్రచారం చేయడానికి తన పీసీసీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు రవి ప్రకటించారు. భాజపాకు భారాస బీ టీం అని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు విమర్శించారు.

* మునుగోడులో తెరాస, భాజపాలు బోగస్‌ ఓటర్ల నమోదుకు ప్రయత్నిస్తున్నాయని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ ఆరోపించారు. దీనిపై పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులకు లేఖలు రాసినట్లు గురువారం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని