భారాస విజయవంతం కావాలి
భారత్ రాష్ట్ర సమితి విజయవంతం కావాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆకాంక్షించారు. తెలంగాణభవన్, ప్రగతిభవన్లో సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి
ఈనాడు, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి విజయవంతం కావాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆకాంక్షించారు. తెలంగాణభవన్, ప్రగతిభవన్లో సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పథకాలు బాగున్నాయని ప్రశంసించారు. దేశమంతా ఇలాంటి పథకాలు అమలుకావాలని కుమారస్వామి ఆకాంక్షించారు. ‘‘కేసీఆర్ గొప్ప అనుభవజ్ఞుడు. దార్శనిక నేత. రైతులు, దళితులపై కేసీఆర్ నిబద్దత చాలాగొప్పది. ఆయన అమలు చేస్తున్న పథకాలతో తెలంగాణలో విజయం సాధించారు. ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం దేశ నిర్మాణం కోసమే ఆయన భారత్ రాష్ట్ర సమితిని ప్రారంభిస్తున్నారు. కేంద్రంలో ఏడేళ్లుగా అధికార దుర్వినియోగం జరుగుతోంది. దానికి గట్టి సమాధానం చెప్పేందుకు ఆయన నిర్ణయించుకున్నారు. రాజకీయ ప్రతీకార భావనతో కాకుండా అభివృద్ధి ద్వారా, దేశ ప్రజల విశ్వాసాన్ని పొందడానికి కేసీఆర్ చేస్తున్న కృషికి మద్దతునిస్తున్నాం’’ అని కుమారస్వామి అన్నారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు