హైదరాబాద్లో జాతీయ దళిత సదస్సు
హైదరాబాద్లో త్వరలో భారత్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జాతీయ దళిత సదస్సు నిర్వహిస్తామని, దేశవ్యాప్తంగా ఉన్న దళిత నేతలు, ఉద్యమకారులను ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
వివిధ రాష్ట్రాల దళిత, రైతు నేతలతో కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్లో త్వరలో భారత్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జాతీయ దళిత సదస్సు నిర్వహిస్తామని, దేశవ్యాప్తంగా ఉన్న దళిత నేతలు, ఉద్యమకారులను ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో దళితుల అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్నామని, ఇదే స్పూర్తితో దేశవ్యాప్తంగా వాటిని అమలు చేసేలా భారాస చొరవ తీసుకుంటుందన్నారు. జాతీయ పార్టీ ప్రకటించి వచ్చిన తర్వాత ప్రగతిభవన్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలు కేసీఆర్ను కలిశారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన శాసనమండలి పక్ష నేత బోజేగౌడ, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రధాన కార్యదర్శి బాలకిషన్రావు, మాజీ మంత్రి రేవణ్ణ, ఎమ్మెల్యే సురేశ్గౌడ, కుమారస్వామి కుమారుడు నిఖిల్గౌడ, విదుతాళై చిరుత్తాగళ్కట్చె (వీసీకే) అధినేత, ఎంపీ తిరుమావళవన్ నేతృత్వంలో వీసీకే కార్యదర్శి బాలసింగం, ఏపీ అధ్యక్షుడు ఎన్జే విద్యాసాగర్, న్యాయ విభాగం నేత నర్సింహమూర్తి, జాతీయ రైతు నేతలు గుర్నాం సింగ్, అక్షయ్కుమార్(ఒడిశా); మాణిక్కదమ్, దశరథ్సావంత్(మహారాష్ట్ర), ఆకాశ్యాదవ్, కున్వర్సింగ్(హరియాణా), ద్రవిడ దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు వంటెల కృష్ణారావు తదితరులు ఆయన్ను ఘనంగా సన్మానించారు.
* సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్యాదవ్, బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆకాంక్షించారు. వారిరువురూ సీఎం కేసీఆర్కు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!