సొంతగూటికి నల్లాల ఓదెలు దంపతులు
మంచిర్యాల జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య, మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి తెరాసలో చేరారు.
కేటీఆర్ సమక్షంలో తెరాసలో చేరిక
ఈనాడు, హైదరాబాద్: మంచిర్యాల జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య, మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి తెరాసలో చేరారు. కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి ప్రశాంత్రెడ్డి, పీయూసీ ఛైర్మన్ జీవన్రెడ్డి, ప్రభుత్వ విప్, మంచిర్యాల తెరాస పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత మే 19న దిల్లీలో ఓదెలు, ఆయన సతీమణి ప్రియాంకగాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఆ పార్టీలోని పరిణామాలతో కలత చెందిన ఓదెలు మళ్లీ తెరాసలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన బాల్కసుమన్ ఆధ్వర్యంలో బుధవారం సీఎం కేసీఆర్ను కలిశారు. ఆయన ఆమోదంతో తిరిగి పార్టీలో చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?