సొంతగూటికి నల్లాల ఓదెలు దంపతులు

మంచిర్యాల జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య, మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి తెరాసలో చేరారు.

Updated : 07 Oct 2022 06:48 IST

కేటీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరిక

ఈనాడు, హైదరాబాద్‌: మంచిర్యాల జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య, మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి తెరాసలో చేరారు. కేటీఆర్‌ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, పీయూసీ ఛైర్మన్‌ జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌, మంచిర్యాల తెరాస పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత మే 19న దిల్లీలో ఓదెలు, ఆయన సతీమణి ప్రియాంకగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీలోని పరిణామాలతో కలత చెందిన ఓదెలు మళ్లీ తెరాసలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన బాల్కసుమన్‌ ఆధ్వర్యంలో బుధవారం సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఆయన ఆమోదంతో తిరిగి పార్టీలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని