సమయం వచ్చినప్పుడు రాజకీయాలపై నిర్ణయం: రఘువీరా
‘గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఆ సమయం వచ్చినప్పుడు.. ఇంతకుముందు నాతో కలిసి అడుగులు వేసిన వారందరితో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాను’ అని మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు.
మడకశిర, మడకశిర గ్రామీణం, న్యూస్టుడే: ‘గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఆ సమయం వచ్చినప్పుడు.. ఇంతకుముందు నాతో కలిసి అడుగులు వేసిన వారందరితో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాను’ అని మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో శుక్రవారం గోవిందాపురం, జీవీపాళ్యం గ్రామస్థులతో ఆయన సమావేశమై, అనంతరం విలేకర్లతో మాట్లాడారు. రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 18న కర్నూలు జిల్లాలో ప్రవేశించనుంది. యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ నీలకంఠేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు, వస్త్రాన్ని రాహుల్గాంధీకి ఇవ్వనున్నట్లు రఘువీరారెడ్డి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?