సమయం వచ్చినప్పుడు రాజకీయాలపై నిర్ణయం: రఘువీరా

‘గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఆ సమయం వచ్చినప్పుడు.. ఇంతకుముందు నాతో కలిసి అడుగులు వేసిన వారందరితో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాను’ అని మాజీ మంత్రి ఎన్‌.రఘువీరారెడ్డి తెలిపారు.

Published : 08 Oct 2022 04:17 IST

మడకశిర, మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే: ‘గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఆ సమయం వచ్చినప్పుడు.. ఇంతకుముందు నాతో కలిసి అడుగులు వేసిన వారందరితో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాను’ అని మాజీ మంత్రి ఎన్‌.రఘువీరారెడ్డి తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో శుక్రవారం గోవిందాపురం, జీవీపాళ్యం గ్రామస్థులతో ఆయన సమావేశమై, అనంతరం విలేకర్లతో మాట్లాడారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఈ నెల 18న కర్నూలు జిల్లాలో ప్రవేశించనుంది. యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ నీలకంఠేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు, వస్త్రాన్ని రాహుల్‌గాంధీకి ఇవ్వనున్నట్లు రఘువీరారెడ్డి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని