ఉత్తరాంధ్ర జగన్ జాగీరు కాదు
అమరావతి రైతులను అడ్డుకోవడానికి ఉత్తరాంధ్ర.. జగన్, వైకాపా నేతల జాగీరు కాదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు.
తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు
ఈనాడు డిజిటల్, అమరావతి : అమరావతి రైతులను అడ్డుకోవడానికి ఉత్తరాంధ్ర.. జగన్, వైకాపా నేతల జాగీరు కాదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. అమరావతి రైతుల పాదయాత్రపై వైకాపా మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్ సహా ఆ పార్టీ ఇతర నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. రైతుల్ని, మహిళల్ని అడ్డుకుంటే ప్రజలే వైకాపా వాళ్ల చొక్కాలు పట్టుకొని నిలదీస్తారన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేకే మంత్రులు నోరుపారేసుకుంటున్నారని చెప్పారు. ‘‘విశాఖను రాజధాని చేస్తామని.. అక్కడి ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి రూ.40 వేల కోట్లు రుణాలు తెచ్చారు. ఆ సొమ్ము ఏమైందో జగన్ సమాధానం చెప్పాలి. అభివృద్ధి వికేంద్రీకరణకు ఈ ప్రభుత్వం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని బొండా డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు