Dharmana Krishna Das: పాదయాత్రను శ్రీకాకుళంలో అడుగుపెట్టనివ్వం: ధర్మాన కృష్ణదాస్‌

అమరావతి ఏకైక రాజధాని అంటూ వికేంద్రీకరణకు వ్యతిరేకంగా యాత్ర చేసుకుంటూ వస్తున్న వారిని జిల్లాలో అడుగుపెట్టనివ్వమని నరసన్నపేట ఎమ్మెల్యే, జిల్లా వైకాపా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ స్పష్టం చేశారు.

Updated : 08 Oct 2022 06:59 IST

మబుగాం (పోలాకి), న్యూస్‌టుడే: అమరావతి ఏకైక రాజధాని అంటూ వికేంద్రీకరణకు వ్యతిరేకంగా యాత్ర చేసుకుంటూ వస్తున్న వారిని జిల్లాలో అడుగుపెట్టనివ్వమని నరసన్నపేట ఎమ్మెల్యే, జిల్లా వైకాపా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పోలాకిలో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో పాల్గొని మాట్లాడారు. ‘విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా చేసేందుకు అవసరమైతే పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడబోం. చంద్రబాబు, ఆయన అనుచరులు విశాఖ రాజధాని వద్దంటూ చెబుతున్న మాటలకు గట్టి సమాధానం ఇస్తాం. ఒక్కప్పుడు హైదరాబాద్‌ అభివృద్ధి అంటూ ఉత్తరాంధ్రుల శ్రమనంతా దోచిపెట్టారు. తన ఆస్తులు అక్కడ పెంచుకున్న చంద్రబాబు ఇప్పుడు అమరావతే రాజధాని అంటూ నాటకాలు ఆడుతున్నారు. ఉత్తరాంధ్రులకు ఎన్నాళ్లీ హింస? జిల్లాలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఉత్తరాంధ్ర ద్రోహులుగా మారారు...’ అని ఆయన పేర్కొన్నారు. నరసన్నపేట వైఎస్సార్‌ కూడలిలో శనివారం ఉదయం 10 గంటల నుంచి రిలే దీక్షకు కూర్చుంటున్నామని ప్రకటించారు. నాలుగు రోజుల దీక్ష అనంతరం ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని