Devineni Uma: ‘కొన్న భూములు అమ్ముకోవడానికే అమరావతిని చంపేశారు’
ముఖ్యమంత్రి జగన్రెడ్డి విశాఖలో కొన్న భూములను అమ్ముకోవడానికే అమరావతి రాజధానిని చంపేశారని, మూడు రాజధానుల పేరిట రాజీనామా డ్రామా ఆడిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
మైలవరం, న్యూస్టుడే: ముఖ్యమంత్రి జగన్రెడ్డి విశాఖలో కొన్న భూములను అమ్ముకోవడానికే అమరావతి రాజధానిని చంపేశారని, మూడు రాజధానుల పేరిట రాజీనామా డ్రామా ఆడిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మూడు రాజధానుల కోసం ఒక్క వైకాపా ఎమ్మెల్యేనే రాజీనామా అంటున్నారంటే, మిగతా 150 మంది అమరావతికి అనుకూలమే కదా? అని సందేహం వ్యక్తం చేశారు. విశాఖలో భూములు లేవన్న విజయసాయిరెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నించారు. భారీగా భూములు కొన్నది ఆయన అల్లుడు, కూతురేనని ఉమా ఆరోపించారు. క్యాంపు కార్యాలయాన్ని సిద్ధం చేసుకుని వెళ్లిపోవడానికి ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. పంచాయతీల్లో సొమ్ముల్లేక వైకాపా సర్పంచులే భిక్షాటన చేసుకోవడం ప్రభుత్వతీరుకు నిదర్శనమన్నారు. మైలవరం నియోజకవర్గంలోని బుడమేరు వంతెన పడిపోతే బాగుచేసే దిక్కు లేదని, గంగినేనిలో రహదారి ఎమ్మెల్యే శంకుస్థాపనకే పరిమితమవడం సిగ్గుచేటన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె