Duvvada: రాజీనామాలతోనే లెక్క తేల్చుకుందాం.. అచ్చెన్నకు ఎమ్మెల్సీ దువ్వాడ సవాల్

మూడు రాజధానులకు మద్దతుగా ఎమ్మెల్సీ పదవికి తాను రాజీనామా చేస్తానని, అమరావతి కోసం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలని వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ సవాలు విసిరారు.  

Updated : 11 Oct 2022 08:57 IST

టెక్కలి, న్యూస్‌టుడే: మూడు రాజధానులకు మద్దతుగా ఎమ్మెల్సీ పదవికి తాను రాజీనామా చేస్తానని, అమరావతి కోసం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలని వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ సవాలు విసిరారు.  వికేంద్రీకరణకు మద్దతుగా సోమవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైకాపా ర్యాలీ అనంతరం అంబేడ్కర్‌ కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడిపై దువ్వాడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజీనామాపై ఒక్క రోజులో నిర్ణయం చెప్పనట్లయితే అచ్చెన్న ఉత్తరాంధ్ర ద్రోహిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పేరాడ తిలక్‌, తూర్పు కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మామిడి శ్రీకాంత్‌, ఎంపీపీ సరోజనమ్మ, సర్పంచి సుజాత పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని