Atchannaidu: కొట్టేసిన ఆస్తుల విలువ పెంచుకునేందుకే విశాఖ రాజధాని: అచ్చెన్నాయుడు
విశాఖను రాజధాని చేయాలన్న వైకాపా ప్రకటన వెనక ఆ పార్టీ నాయకులు విశాఖలో, చుట్టుపక్కల కొట్టేసిన ఆస్తుల విలువ పెంచుకొనే కుట్ర ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు.
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
టెక్కలి, న్యూస్టుడే: విశాఖను రాజధాని చేయాలన్న వైకాపా ప్రకటన వెనక ఆ పార్టీ నాయకులు విశాఖలో, చుట్టుపక్కల కొట్టేసిన ఆస్తుల విలువ పెంచుకొనే కుట్ర ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన ధర్మాన, బొత్స, తమ్మినేని ఏనాడైనా ఉత్తరాంధ్రకు మేలుచేశారా? అమర్నాథ్, అప్పలరాజు సైతం కల్లు తాగిన కోతుల్లా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మమ్మల్ని రాజీనామా చేయమంటున్నారు, మేం మీలాగా విధానాలు మార్చుకోలేదుగా? 2019 ఎన్నికల్లో వైకాపా మూడు రాజధానుల నినాదంతో ఎన్నికలకు వెళ్లిందా?’ అని అచ్చెన్న ప్రశ్నించారు. ‘పవన్కల్యాణ్తో చంద్రబాబు కలిస్తే వైకాపాకు వచ్చిన బాధేంటి? విపక్షాలన్నీ కలిస్తే జగన్ ఎన్ని బటన్లు నొక్కినా లాభం లేదని సర్వేలు తేల్చి చెప్పడంతో ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నార’ని విమర్శించారు. ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ గతంలో రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖ.. నేడు అక్రమాలకు, గంజాయికి రాజధానిగా మారిందని వాపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!