YS Sharmila: షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత
వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు కూడలిలో షర్మిల ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలను నెరవేర్చలేదని విమర్శించారు.
కేసీఆర్ను విమర్శిస్తున్నారని తెరాస కార్యకర్తల నినాదాలు
ధర్మారం, న్యూస్టుడే: వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు కూడలిలో షర్మిల ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన తెరాస కార్యకర్తలు వైతెపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి షర్మిల స్పందిస్తూ తెరాసకు, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తనపై దాడి చేసేందుకు వచ్చిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కొత్తూరు నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభించగా న్యూకొత్తపల్లి సమీపంలో తెరాస శ్రేణులు రహదారిపై అడ్డంగా బైఠాయించాయి. పోలీసులు వారిని పక్కకు తప్పించారు. న్యూకొత్తపల్లి మీదుగా చామనపల్లికి చేరుకున్న షర్మిల ప్రధాన కూడలిలో మాట్లాడుతూ మంత్రి కొప్పుల ఈశ్వర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాసమస్యలు పరిష్కరించేందుకు పాదయాత్ర చేస్తున్న ఆడబిడ్డపై దాడి చేయాలనుకునే వారు మహిళలకంటే తక్కువేనన్నారు. అనంతరం కటికెనపల్లి వరకు యాత్ర కొనసాగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్