నా మనుషులనే అదుపులోకి తీసుకుంటారా?: వైకాపా ఎమ్మెల్యే ఆగ్రహం
తన వర్గీయులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ (వైకాపా) ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్నూలు నేరవిభాగం, కర్నూలు గ్రామీణ న్యూస్టుడే: తన వర్గీయులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ (వైకాపా) ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు స్టేషన్కు వెళ్లి పోలీసు అధికారులను నిలదీశారు. కర్నూలు మండలం ఎదురూరు గ్రామంలో కత్తులు పట్టుకుని తిరుగుతున్నట్లు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో రావటంతో వైకాపాకు చెందిన రమేష్, సురేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధాకర్ 50 మందితో కలిసి బుధవారం అర్ధరాత్రి బి.తాండ్రపాడులోని కర్నూలు తాలూకా అర్బన్ పోలీసు స్టేషన్కు వెళ్లారు. సీఐ శేషయ్య, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే వారిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్