Nandigam Suresh: సెబ్ పోలీసులపై వైకాపా ఎంపీ అనుచరుల దౌర్జన్యం!
రాజధాని ప్రాంతంలో అర్ధరాత్రి ఇసుక లోడ్తో వెళుతున్న లారీని ఆపినందుకు సెబ్ పోలీసులపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ‘రాత్రిపూట మఫ్టీలో ఇక్కడకు రావడం ఏమిటి? అసలు మీ సంగతేమిటో తేలుద్దాం.. ఎంపీ ఇంటికి పదండి’ అంటూ సిబ్బందినే ఆదేశించారు. తమకు జరిగిన పరాభవాన్ని ఓ ఉద్యోగి ఫోన్లో పై అధికారులకు చేరవేయడంతో...
ఇసుక లారీ ఆపి, బిల్లులు అడిగారని అక్కసు
రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెంలో ఘటన
ఈనాడు, అమరావతి: రాజధాని ప్రాంతంలో అర్ధరాత్రి ఇసుక లోడ్తో వెళుతున్న లారీని ఆపినందుకు సెబ్ పోలీసులపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ‘రాత్రిపూట మఫ్టీలో ఇక్కడకు రావడం ఏమిటి? అసలు మీ సంగతేమిటో తేలుద్దాం.. ఎంపీ ఇంటికి పదండి’ అంటూ సిబ్బందినే ఆదేశించారు. తమకు జరిగిన పరాభవాన్ని ఓ ఉద్యోగి ఫోన్లో పై అధికారులకు చేరవేయడంతో... వారు జోక్యం చేసుకుని ఇరువర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. రెండు రోజుల కిందట చోటుచేసుకున్న ఈ ఘటన సోమవారం వెలుగుజూసింది. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం నుంచి ఇసుక లారీ ఒకటి సీడ్ యాక్సెస్ రోడ్డులోకి ప్రవేశించింది. దానికి బిల్లులు లేనట్లు సమాచారం అందడంతో సెబ్ ఎస్సై ఎన్.టి.కోటారెడ్డి నలుగురు కానిస్టేబుళ్లతో కలిసి లారీని ఆపారు. సమీపంలోనే ఉన్న కొందరు యువకులు వెంటనే లారీ వద్దకు చేరుకుని ‘ఈ సమయంలో లారీని ఆపడం ఏమిటి? ఎంపీ ఇంటికి సమీపంలోనే లారీని ఆపుతారా?’ అంటూ పోలీసులతో వాదనకు దిగారు. మరోవైపు లారీ డ్రైవర్ ఫోన్ చేయడంతో నిమిషాల వ్యవధిలోనే రెండు కార్లలో మరో 10 మంది యువకులు చేరుకున్నారు. సెబ్ పోలీసులను దుర్భాషలాడారు. ఇదే అదనుగా లారీ డ్రైవర్ లారీని తీసుకుని వెళ్లిపోయాడు. వెంటనే ఎస్ఐ కోటారెడ్డి తుళ్లూరు పోలీస్స్టేషన్కు చేరుకుని ఎంపీ మనుషులు తమ విధులను అడ్డుకున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై ఐపీసీ యాక్టు 353, మైనింగ్ యాక్టు 379 కింద కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
లారీతో సంబంధం లేని వారిని ప్రశ్నించడంతోనే వివాదం
- నందిగం సురేష్, ఎంపీ, బాపట్ల
‘సీడ్యాక్సెస్ రోడ్లో కొందరు యువకులు కూర్చుని ఉండగా పోలీసులు అర్ధరాత్రి వేళ వారి వద్దకు వచ్చి, ఇసుక తరలింపుపై ప్రశ్నించారు. వారు తమకు సంబంధం లేదని, ఆ పోయే లారీని ఆపండి. దాని యజమాని ఎవరో వస్తారని సూచించారు. అదేం వినిపించుకోకుండా పోలీసులు యువకులను గదమాయించడంతోనే మీరు సెబ్ పోలీసులని మేం ఎలా భావించాలని వారు తిరిగి ప్రశ్నించారు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. అంతేతప్ప వారెవరో నాకు తెలియదు. నా అనుచరులు ఎవరూ ఎవరినీ అడ్డగించలేదు. ఆ ఇసుక లారీతోనూ నాకు సంబంధం లేదు.’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్