భాజపాకు ఉచిత సంకటం!
ఎన్నికలు దగ్గరపడ్డా గుజరాత్లో అధికార భారతీయ జనతా పార్టీ ఇంకా మేనిఫెస్టో విడుదల చేయలేదు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే అనేక ఉచితాలు, హామీలు గుప్పించటంతో భాజపా ఆలోచనలో పడింది.
ఎన్నికలు దగ్గరపడ్డా గుజరాత్లో అధికార భారతీయ జనతా పార్టీ ఇంకా మేనిఫెస్టో విడుదల చేయలేదు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే అనేక ఉచితాలు, హామీలు గుప్పించటంతో భాజపా ఆలోచనలో పడింది.
ఉచితాలకు తాము వ్యతిరేకమనే వాదనకు కమలనాథులు కట్టుబడతారా లేక ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ఈసారికి తాము గీసుకున్న గీత దాటుతారా... లేక తాయిలాలను మరిపించేలా ఏదైనా చేస్తారా అనేది ఆసక్తికరం! గుజరాత్ మేనిఫెస్టో విషయంలో భాజపా కాసింత కఠిన పరీక్షనే ఎదుర్కొంటోంది. తొలి విడత ఎన్నికలకు (డిసెంబరు 1) మరో వారం రోజులే ఉన్నా గెలిస్తే ఏం చేస్తామో చెప్పే సంకల్ప పత్రంపై పార్టీ కసరత్తు చేస్తూనే ఉంది. మరోవైపు ప్రత్యర్థి కాంగ్రెస్తో పాటు ప్రచారంలో ముందున్న ఆమ్ ఆద్మీ పార్టీ తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. తాము గెలిస్తే ఏం చేస్తామో చెప్పేశాయి. రెండు పార్టీలు కూడా పోటీపడి లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు, ఉచిత విద్యుత్, నిరుద్యోగ భృతిలాంటి ఉచిత తాయిలాలు, పాత పింఛను పథకం అమలులాంటి హామీలు గుప్పించాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న దిల్లీ, పంజాబ్ల్లో తాము అనుసరిస్తున్న విద్య, ఆరోగ్య పథకాలను కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా రచారం చేసుకుంటోంది. మరి వీటికి పోటీగా భాజపా ఏం చెబుతుందని అంతా ఎదురుచూస్తున్నారు.
అగ్రేసర్ గుజరాత్ పేరుతో...
గత ఎన్నికల్లో సీట్లు తగ్గిన అనుభవానికి తోడు... ఈసారి రాష్ట్రంలో బలమైన ముద్ర వేసేందుకు ఆమ్ ఆద్మీపార్టీ చూపుతున్న దూకుడు నేపథ్యంలో భాజపా ఆచితూచి వ్యవహరిస్తోంది. వీటికి తోడు ఎన్నికలకు ముందు ప్రజలకు పార్టీలు ఉచిత తాయిలాలు ప్రకటించటాన్ని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. ఇలాంటి హామీల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఇవన్నీ కూడా మేనిఫెస్టో విడుదల విషయంలో భాజపాను కట్టడి చేస్తున్నాయి. అందుకే ఎప్పటిలా హామీలతో మేనిఫెస్టోను వెల్లడించకుండా భాజపా ఈసారి ‘అగ్రేసర్ గుజరాత్’ అంటూ కొత్త దారి పట్టింది. రాష్ట్రాన్ని మెరుగు పర్చటానికి, అగ్రస్థానంలో ఉంచటానికి ఏం చేయాలో చెప్పాలంటూ ప్రజల నుంచే సూచనలు తీసుకొనే కార్యక్రమమే ఈ అగ్రేసర్ గుజరాత్! రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, పల్లెల్లో ఇందుకోసం ప్రత్యేకంగా పెట్టెలు పెట్టారు. మెయిల్ ద్వారా కూడా సూచనల్ని ఆహ్వానించారు. ఈనెల 15 దాకా ఈ కార్యక్రమం కొనసాగింది.
కింకర్తవ్యం..?
ఉచితాలను విమర్శిస్తున్నా... వాటికి పూర్తిగా భాజపా దూరంగా ఉండగలుగుతుందా అనేది చూడాల్సిన అంశం. ఎందుకంటే... ఆమ్ ఆద్మీపార్టీ, కాంగ్రెస్ ఇచ్చినవి కీలకమైన హామీలు. ముఖ్యంగా 300 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ అనేది మధ్యతరగతిని బాగా ఆకట్టుకుంటోంది. వాటిని తలదన్నేలా భాజపా ఏం చెబుతుందన్నది ఆసక్తికరం. ఇటీవల గుజరాత్ ప్రచార సభల్లో ప్రధాని నరేంద్రమోదీ ‘ఉచిత విద్యుత్ కష్టమైనప్పటికీ ఇవ్వటానికి ప్రయత్నిస్తాం’ అన్నట్లుగా వార్తలొచ్చాయి. రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితం; ఉమ్మడి పౌర చట్టంలాంటి హామీలైతే భాజపా మేనిఫెస్టోలో కచ్చితంగా ఉంటాయనుకుంటున్నారు.
- ఈనాడు ప్రత్యేక విభాగం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
EarthQuake: తుర్కియే, సిరియాలో భారీ భూకంపం.. 90మందికి పైగా మృతి
-
Movies News
Telugu Movies: ఈ వారం ఇటు థియేటర్ అటు ఓటీటీ సందడే సందడి
-
World News
US Visa: విదేశాల్లో ఉన్న భారతీయులకు అక్కడే అమెరికా వీసా
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
Telangana News: గూగులమ్మకు యూట్యూబ్ కళాకారుల బోనాలు
-
Politics News
Andhra News: నా ఫోన్ కూడా నిఘాలో ఉందనుకుంటున్నా: ఎమ్మెల్సీ విఠపు