మోదీ అధికార దుర్వినియోగం: కూనంనేని
ప్రధాని మోదీ రాజ్యాంగ సంస్థల ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.
హిమాయత్నగర్, న్యూస్టుడే: ప్రధాని మోదీ రాజ్యాంగ సంస్థల ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. గురువారం హైదరాబాద్లోని మఖ్దూంభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయడం కొత్త కాదని, ఇదివరకు సీబీఐ విషయంలోనూ ఇదే తరహాలో చెప్పిందని చెప్పారు. సీబీఐ, ఈడీ, సెంట్రల్ విజిలెన్స్, ఐటీ వంటి సంస్థలను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అక్రమ పద్ధతిలో గద్దెనెక్కుతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బి.ఎల్.సంతోష్కు నోటీసులిస్తే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కన్నీరు పెట్టుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వామపక్షాల గురించి మాట్లాడేటప్పుడు సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే అంతకంటే రెట్టింపు స్థాయిలో ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!