జగన్పై యుద్ధానికి సమరభేరి ర్యాలీలు
దళిత సంక్షేమాన్ని నిర్వీర్యం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై యుద్ధం చేయడానికి దళిత సమరభేరి ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు పేర్కొన్నారు.
తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు
తిరుపతి (విద్య), న్యూస్టుడే: దళిత సంక్షేమాన్ని నిర్వీర్యం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై యుద్ధం చేయడానికి దళిత సమరభేరి ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు పేర్కొన్నారు. తిరుపతి వేదికగా గురువారం తెదేపా ఆధ్వర్యంలో దళిత సమరభేరి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై జరుగుతున్న దమనకాండను, యువతపై జరుగుతున్న హత్యాకాండను, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ తిరుగుబాటు సమర శంఖారావాన్ని తిరుపతిలో పూరించాం. అన్ని ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించి లక్షలమందితో మార్చిలో దళిత గర్జన మహాసభను విజయవాడలో నిర్వహిస్తాం. మూడేళ్లలో దళితుల సంక్షేమం.. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు సంబంధించి నిధుల కేటాయింపుపై శ్వేతపత్రం విడుదల చేయాలి. దీనిపై బహిరంగ చర్చకు రావాలి’ అని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు నరసింహయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM