అత్యాచార నిందితుడిని కాపాడేందుకు మంత్రి బంధువు ప్రయత్నం: మంద కృష్ణ మాదిగ
ఏపీలో దళిత యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కాపాడేందుకు మంత్రి బంధువు ప్రయత్నిస్తున్నారని... దీనిపై సీఎం స్పందించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు.
గుంటూరు (బ్రాడీపేట), న్యూస్టుడే: ఏపీలో దళిత యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కాపాడేందుకు మంత్రి బంధువు ప్రయత్నిస్తున్నారని... దీనిపై సీఎం స్పందించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. గుంటూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘గుంటూరులో దళిత యువతిపై అత్యాచారం చేసిన నిందితుడు సాంబయ్య చౌదరిపై ఈనెల 8న పట్టాభిపురంలో కేసు నమోదైనా ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. పైగా నిందితుడు, అతని కుటుంబ సభ్యులను అరెస్టు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. నిందితుడిని కాపాడేందుకు మంత్రి విడదల రజిని మరిది గోపీనాథ్ పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. మంత్రి అనుచరులు నాకు, మా నాయకులకు ఫోన్ చేసి కేసు రాజీ చేసుకునేలా యత్నించాలని కోరారు. బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించకుండా నేటికీ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నారు. ఆమెకు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ నేతలు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తంచేస్తుంటే.. నగరంపాలెం సీఐ వారిపై దాడి చేశారు. నిందితుడిని అరెస్టు చేయడంతోపాటు సీఐపై చర్యలు తీసుకోవాలి. లేదంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆందోళనలు చేస్తాం’ అని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు