ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు
ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు భారీగా ఉన్నాయని, ఓటర్ల నమోదులో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోంది
రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాల ఫిర్యాదు
ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు భారీగా ఉన్నాయని, ఓటర్ల నమోదులో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. వీటిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సచివాలయంలోని అయిదో బ్లాక్లో ఎన్నికల సంఘం శుక్రవారం సమావేశాన్ని నిర్వహించింది.
ప్రతిపక్షాలు ప్రస్తావించిన అంశాలివి..
* రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ సంఖ్యలో ఉపాధ్యాయ ఓటర్ల దరఖాస్తులను తిరస్కరించారు. తిరస్కరించడానికి కారణాలను ప్రకటించాలి.
* తూర్పు రాయలసీమ నియోజకవర్గంలో ఈనెల 7న సాయంత్రం 6 గంటల వరకు 2.81 లక్షల మంది ఓటర్లుగా నమోదవగా, రాత్రి 12గంటలకు ఈసంఖ్య 4.17లక్షలకు చేరింది. ఒకేసారి ఇన్ని దరఖాస్తులు ఎలా వచ్చాయి?
* బోగస్ ధ్రువీకరణలతో ఓటర్లుగా నమోదైన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఒకే వ్యక్తి 2,3 చోట్ల చిన్న మార్పులతో ఓటర్లుగా నమోదయ్యారు.
* ప్రైవేటు టీచర్ల దరఖాస్తుల పరిశీలనకు ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించాలి.
* ఆధార్, రేషన్కార్డు ఆధారంగా కూడా ఓటరుగా నమోదుచేసిన సంఘటనలూ ఉన్నాయి. అర్హుల పేర్లు జాబితాలో కనిపించడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!