సీఎం సభ కోసం పొలం పాడుబెట్టాలా?
ముఖ్యమంత్రి బహిరంగ సభ నేపథ్యంలో అపరాల పంట వేయొద్దని ఎమ్మెల్యే తమకు హుకుం జారీ చేశారని.. అదును తప్పితే నష్టపోతామని పలువురు రైతులు గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వద్ద వాపోయారు.
గుడివాడ రైతుల ఆవేదన
గుడివాడ గ్రామీణం, న్యూస్టుడే: ముఖ్యమంత్రి బహిరంగ సభ నేపథ్యంలో అపరాల పంట వేయొద్దని ఎమ్మెల్యే తమకు హుకుం జారీ చేశారని.. అదును తప్పితే నష్టపోతామని పలువురు రైతులు గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వద్ద వాపోయారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం మల్లాయపాలెం టిడ్కో ఇళ్ల సమీపంలో వచ్చే నెల 21న సీఎం జగన్మోహన్రెడ్డి సభ జరగనుంది. అందుకని.. తాము కౌలు చేస్తున్న 14 ఎకరాల్లో అపరాల పంట వేయొద్దని ఎమ్మెల్యే కొడాలి నాని ఆదేశించారని రైతులు నాగేశ్వరరావు, నాగరాజు శుక్రవారం ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వద్ద వాపోయారు. పస్తుతం అదును పోతుందని.. ఎకరాకు రూ.30 వేల వరకు నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కౌలు రైతులకు నష్టం జరగకుండా చూడాలని.. లేని పక్షంలో రైతులతో కలిసి సీఎం సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో పి.పద్మావతితో మాట్లాడి నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా