నాని, వంశీల అనుచరుడి ఆధ్వర్యంలోనే సంకల్ప సిద్ధి కుంభకోణం
వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని, తెదేపా నుంచి వైకాపాలోకి వెళ్లిన వల్లభనేని వంశీల ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగా ఆధ్వర్యంలోనే సంకల్ప సిద్ధి సంస్థ కుంభకోణం జరిగిందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు.
కాజేసిన రూ.1100 కోట్లతో బినామీల పేరిట భూ కొనుగోళ్లు
సజ్జల కనుసన్నలోనే తతంగమంతా
తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపణ
ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని, తెదేపా నుంచి వైకాపాలోకి వెళ్లిన వల్లభనేని వంశీల ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగా ఆధ్వర్యంలోనే సంకల్ప సిద్ధి సంస్థ కుంభకోణం జరిగిందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. సంస్థ ముసుగులో నాని, వంశీలు రూ.1,100 కోట్ల పేదల సొమ్ము కాజేసి హైదరాబాద్, బెంగళూరుల్లో బినామీ పేర్లతో భూ కొనుగోళ్లు జరిపారని పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ‘అవినీతి చక్రవర్తి జగన్రెడ్డి పాలనలో రాష్ట్రంలో మరో నయా కుంభకోణం వెలుగు చూసింది. గుత్తా వేణుగోపాలకృష్ణ, గుత్తా కిరణ్లు బినామీలుగా సంకల్ప సిద్ధి సంస్థ గుడివాడ, గన్నవరం కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహించింది. ఆ సంస్థ కేవలం లక్ష పెయిడ్ అప్ క్యాపిటల్తో ప్రారంభమై భారీ కుంభకోణానికి పాల్పడిందంటే సంస్థ నిర్వాహకులు, వారివెనకున్న నాని, వంశీలు ఎంత పెద్ద ఘరానా దొంగలో అర్థమవుతుంది’ అని అన్నారు.
రూ.20 వేలు చెల్లిస్తే 10 నెలల్లో రూ.60 వేలిస్తామంటూ వంచన...
‘తొలుత రూ.20 వేలు సంస్థలో పెట్టుబడి పెడితే 10 నెలల్లో రూ.60 వేలు తిరిగిస్తామని ప్రజల్ని మోసగించారు. ప్రజలకు అనుమానం రాకూడదని సంకల్ప సిద్ధి మార్ట్ల పేరుతో దుకాణాల్ని తెరిచారు. ఆగ్రోఫామ్స్ అని, గంధపు చెట్ల పెంపకమని, రియల్ ఎస్టేట్ వెంచర్ల నిర్వహణని చెప్పి....వాటిపై వచ్చే సొమ్ముని పెట్టుబడిగా పెట్టిన వారికి పంచుతామని వంచించారు. 25 సెంట్ల భూమి అమ్మితే వెంటనే రూ.50 వేల కమిషన్తోపాటు రోజుకి రూ.500 చొప్పున 300 రోజులు డబ్బులిస్తామని ప్రజల్ని బుట్టలో పడేశారు’ అని పేర్కొన్నారు.
ఈ కుంభకోణం సీఐడీ చీఫ్కు కనిపించడం లేదా?
‘స్వచ్ఛందంగా ఎవరూ ఫిర్యాదు చేయకుండానే ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టే సీఐడీ చీఫ్ సునీల్కుమార్కు ఈ కుంభకోణం కనిపించడం లేదా? ఓలుపల్లి రంగా ఎవరు? అతనికి రెండేళ్లక్రితం ఉన్న ఆస్తులెంత? ఇప్పుడున్నవెంత? కుంభకోణంలో నాని, వంశీల పాత్ర ఏంటి? అనే విషయాలపై విచారణ చేయాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు.
పంపకాల్లో తేడా వచ్చే నాని పదవిని పీకేశారా?
‘ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లోనే ఇది జరిగింది. రూ.1100 కోట్ల కుంభకోణంలో తాడేపల్లి ప్యాలెస్కి వాటాలు సరిగా దక్కకపోవడంతోనే జగన్రెడ్డి....నానికి పార్టీలో ఉన్న ప్రాంతీయ సమన్వయకర్త పదవిని పీకేశారా? సంకల్ప సిద్ధి కుంభకోణంపై సజ్జల రామకృష్ణారెడ్డి, విజయవాడ పోలీస్ కమిషనర్ సమాధానం చెప్పాలి. నాని, వంశీల ప్రమేయం లేకపోతే ప్రభుత్వం తక్షణం సీఐడీతో విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ