Gujarat Election 2022: వచ్చేది ఆప్‌ సర్కారే.. కాగితంపై రాసి మరీ కేజ్రీవాల్‌ ధీమా

గుజరాత్‌లో ఈ దఫా ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రభుత్వం ఏర్పాటవడం ఖాయమని ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు.

Updated : 28 Nov 2022 08:31 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో ఈ దఫా ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రభుత్వం ఏర్పాటవడం ఖాయమని ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధిస్తుందని రాతపూర్వకంగా ఉద్ఘాటించారు. సూరత్‌లో ఆదివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వస్తే.. వచ్చే ఏడాది జనవరి 31 నుంచే పాత పింఛను పథకాన్ని తిరిగి అమల్లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దిల్లీ, పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ గెలుస్తుందని తాను చెప్పిన జోస్యం నిజమైందని గుర్తుచేశారు. గుజరాత్‌లోనూ అదే జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఆప్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందంటూ ఓ కాగితంపై రాసిమరీ చూపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని