రాష్ట్ర కాంగ్రెస్కు కొత్త దళం
రాష్ట్ర కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటనకు రంగం సిద్ధమైంది.
డిసెంబరు 4న ప్రకటించే అవకాశం?
ఈనాడు, దిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటనకు రంగం సిద్ధమైంది. పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులను డిసెంబరు 4న ప్రకటించనున్నట్లు తెలిసింది. ఏఐసీసీ అధ్యక్షునిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యాక సంస్థాగత మార్పులపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కార్యవర్గం కూర్పుపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, రోహిత్ చౌదరి, నదీం జావెద్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిలు ఇటీవల కసరత్తు చేసిన విషయం విదితమే. నూతన కార్యవర్గం ప్రకటన నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నల్గొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్లు మంగళవారం ఖర్గేను ఆయన నివాసంలో వేర్వేరుగా కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, పీసీసీ పనితీరుతో పాటు కార్యవర్గంలో తమ వర్గం నేతలకు అవకాశంపై వారు చర్చించినట్లు తెలిసింది. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. మర్యాదపూర్వకంగానే ఖర్గేను కలిశామని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02/02/23)
-
Sports News
WPL: మహిళల ప్రీమియర్ లీగ్.. ఫిబ్రవరి రెండో వారంలోనే వేలం!
-
Sports News
Usman Khawaja: వీసా ఆలస్యంతో ఆస్ట్రేలియా ఓపెనర్ అసంతృప్తి.. ఫన్నీ పోస్ట్ వైరల్
-
Movies News
Kiara Sidharth Malhotra: కియారా- సిద్ధార్థ్ల వివాహం అప్పుడేనా? శరవేగంగా పనులు..!
-
Movies News
Mukhachitram: విశ్వక్సేన్ ‘ముఖచిత్రం’.. ఓటీటీలోకి వచ్చేస్తోంది!
-
Politics News
CM Kcr-Amith jogi: సీఎం కేసీఆర్తో అమిత్ జోగి భేటీ.. జాతీయ రాజకీయాలపై చర్చ