కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తాం: రుద్రరాజు
రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తామని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. మంగళవారం దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రుద్రరాజు, పీసీసీ కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈనాడు, దిల్లీ: రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తామని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. మంగళవారం దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రుద్రరాజు, పీసీసీ కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విలేకర్లతో రుద్రరాజు మాట్లాడుతూ.. చింతన్ శిబిర్లో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు యువ నాయకత్వానికి అప్పగించారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఖర్గే దిశానిర్దేశం చేశారని తెలిపారు. యువత, విద్యార్థి, మహిళా కాంగ్రెస్ అనుబంధ విభాగాలను బలోపేతం చేస్తామని, సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకుంటూ సమన్వయంతో పని చేస్తామన్నారు. ఖర్గేను కలిసిన వారిలో ఏఐసీసీ కార్యదర్శి సీడీ మయ్యప్పన్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి అజీనా, కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, మస్తాన్వలీ, రాకేశ్ రెడ్డి, జంగా గౌతమ్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగ మధు యాదవ్ తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్