కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేస్తాం: రుద్రరాజు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేస్తామని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. మంగళవారం దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రుద్రరాజు, పీసీసీ కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 30 Nov 2022 05:33 IST

ఈనాడు, దిల్లీ: రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేస్తామని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. మంగళవారం దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రుద్రరాజు, పీసీసీ కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విలేకర్లతో రుద్రరాజు మాట్లాడుతూ.. చింతన్‌ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర కాంగ్రెస్‌ పగ్గాలు యువ నాయకత్వానికి అప్పగించారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి ఖర్గే దిశానిర్దేశం చేశారని తెలిపారు. యువత, విద్యార్థి, మహిళా కాంగ్రెస్‌ అనుబంధ విభాగాలను బలోపేతం చేస్తామని, సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకుంటూ సమన్వయంతో పని చేస్తామన్నారు. ఖర్గేను కలిసిన వారిలో ఏఐసీసీ కార్యదర్శి సీడీ మయ్యప్పన్‌, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి అజీనా, కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, మస్తాన్‌వలీ, రాకేశ్‌ రెడ్డి, జంగా గౌతమ్‌, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగ మధు యాదవ్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని