జగన్‌ సిగ్గుతో తలదించుకోవాలి

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేసినందుకు సీఎం జగన్‌ సిగ్గుతో తలదించుకోవాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్‌వలీ అన్నారు.

Published : 30 Nov 2022 05:33 IST

పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్‌ వలీ

ఈనాడు, దిల్లీ: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేసినందుకు సీఎం జగన్‌ సిగ్గుతో తలదించుకోవాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్‌వలీ అన్నారు. దిల్లీ ఏపీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుడి హత్య కేసులోనే రాష్ట్రంలో న్యాయం జరగకపోతే ఎలాగని ఆయన ప్రశ్నించారు. ఈ కేసుపై సీబీఐతో కాకుండా సుప్రీంకోర్టు సిటింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని