చంద్రబాబు పర్యటన భగ్నంచేసేందుకు వైకాపా కుట్రలు
జడ్ ప్లస్ కేటగిరీ రక్షణ ఉన్న ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు పర్యటనను భగ్నం చేసేందుకు వైకాపా నేతలు కుట్రలు చేస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డీజీపీకి మంగళవారం ఫిర్యాదు చేశారు.
డీజీపీకి వర్ల రామయ్య ఫిర్యాదు
ఈనాడు-అమరావతి: జడ్ ప్లస్ కేటగిరీ రక్షణ ఉన్న ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు పర్యటనను భగ్నం చేసేందుకు వైకాపా నేతలు కుట్రలు చేస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డీజీపీకి మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ పర్యటనకు ఏలూరు ఎస్పీ, సంబంధిత పోలీసు అధికారుల నుంచి అనుమతులు తీసుకున్నాసరే వైకాపా నేతలు అనేక కౌంటర్ కార్యక్రమాలు మొదలుపెట్టారని పేర్కొన్నారు.. చంద్రబాబు పర్యటన మార్గంలో తెదేపా జెండాలు, పోస్టర్లు కనిపించకుండా వైకాపా బ్యానర్లు, ఫ్లెక్సీలతో నింపేశారన్నారు. వైకాపా మద్దతుదారులు, సంఘ విద్రోహులతో చంద్రబాబు పర్యటనకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, పటిష్ట భద్రత కల్పించాలని వర్ల రామయ్య కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?