రాష్ట్రంలో భాజపా, జనసేనలే ప్రత్యామ్నాయం
వైకాపా, భాజపాకి మధ్య ఉన్నది రాజ్యాంగ బద్ధమైన సంబంధమని, అంతకుమించి ఏమీ లేదని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
ఎంపీ జీవీఎల్ నరసింహారావు
విశాఖపట్నం(పెదవాల్తేరు), న్యూస్టుడే: వైకాపా, భాజపాకి మధ్య ఉన్నది రాజ్యాంగ బద్ధమైన సంబంధమని, అంతకుమించి ఏమీ లేదని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. విశాఖలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రధాన ప్రత్యామ్నాయంగా భాజపా, జనసేనలు నిలుస్తాయి. ప్రజలు మాకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. పోలవరం నిర్మాణంలో జాప్యానికి వైకాపానే కారణం.ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు దశాబ్దాలుగా కుంటుపడి ఉన్నాయి. నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చించేందుకు వైకాపా నేతలు ముందుకు రావాలి’అని జీవీఎల్ సవాలు విసిరారు. విశాఖలో భారీగా భూములను ఆక్రమిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘గతంలో రెండు పార్టీలూ సిట్లు (ప్రత్యేక దర్యాప్తు బృందాలు) వేశాయి. వాటి నివేదికలను ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు. వైకాపా ప్రభుత్వం వేసిన సిట్ నివేదిక అక్టోబరులో సిద్ధమైనప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదో తెలపాలి. రానున్న పార్లమెంటు సమావేశాల్లో విశాఖలో భూ కుంభకోణాలపై ప్రస్తావిస్తా. విశాఖలో వచ్చే ఏప్రిల్ నాటికి 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. వందే భారత్ రైళ్లను మూడింటిని నడపబోతున్నాం. విశాఖ నుంచి తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు మార్గాల్లో ఇవి నడుస్తాయి’ అని జీవీఎల్ తెలిపారు. పార్టీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి