తూర్పు తీరాన్ని గుప్పెట్లో పెట్టుకునేలా జగన్ ప్రణాళిక
రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ ఉన్న తూర్పు సముద్రతీర ప్రాంతాన్ని జగన్ తన బినామీల ద్వారా ఆక్రమించి, గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రణాళిక అమలు చేస్తున్నారని శాసనమండలి ప్రతిపక్షనేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కాకినాడ జిల్లా తునిలో విలేకర్లతో శనివారం ఆయన మాట్లాడారు.
శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల ఆరోపణ
తుని, న్యూస్టుడే: రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ ఉన్న తూర్పు సముద్రతీర ప్రాంతాన్ని జగన్ తన బినామీల ద్వారా ఆక్రమించి, గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రణాళిక అమలు చేస్తున్నారని శాసనమండలి ప్రతిపక్షనేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కాకినాడ జిల్లా తునిలో విలేకర్లతో శనివారం ఆయన మాట్లాడారు. ‘బినామీల ద్వారా భూములు సేకరించి, షేరు ఇస్తేనే పరిశ్రమలు పెట్టుకోవడానికి అనుమతులు ఇస్తున్నారు. విజయసాయిరెడ్డి అల్లుడు, జగన్కు కావాల్సిన వాళ్లు అరబిందో పరిశ్రమ స్థాపనకు పనులు చేస్తున్నారు. గన్నవరం, విశాఖ, కృష్ణపట్నం వంటి పోర్టుల పరిధిలోను ఇలానే జరుగుతోంది...’ అని యనమల పేర్కొన్నారు. అసమర్థ పాలనతో రూ.1.73 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని ధ్వజమెత్తారు. బల్క్ డ్రగ్ వంటి కాలుష్య భరిత పరిశ్రమలతో తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. గాలి, నీరు, భూమి, భూగర్భజలాలు హానికరంగా మారిపోతే ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అందుకే తాము జాతీయ హరిత ట్రైబ్యునల్ను ఆశ్రయించామని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: ‘ఫర్జీ’ కోసం రాశీఖన్నా వెయిటింగ్.. శివాత్మిక లవ్ సింబల్!
-
Sports News
Team India: భారత క్రికెట్ భవిష్యత్ సూపర్ స్టార్లు వారే: కుంబ్లే
-
Sports News
SKY: క్లిష్ట పరిస్థితుల్లోనూ.. ప్రశాంతంగా ఉండటం అలా వచ్చిందే..: సూర్యకుమార్
-
Politics News
KTR: పీఎం కేర్స్పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్
-
Sports News
IND vs NZ: ఉమ్రాన్ ఇంకా నేర్చుకోవాలి.. మణికట్టు మాంత్రికుడు ఉండాల్సిందే: వసీమ్ జాఫర్
-
India News
Budget 2023: ఎన్నికల ఎఫెక్ట్.. బడ్జెట్లో కర్ణాటకకు ‘ప్రత్యేక’ కేటాయింపులు