వైకాపా నేతల కనుసన్నల్లో ‘జూదం మాఫియా’
బాపట్ల జిల్లా రేపల్లె సమీపంలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో వైకాపా ఎంపీ మోపిదేవి వెంకటరమణ అండదండలతో ఆయన కుటుంబ సభ్యులు జూదం మాఫియాను పోషిస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు.
సీఎం జగన్కు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ
ఈనాడు డిజిటల్, అమరావతి: బాపట్ల జిల్లా రేపల్లె సమీపంలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో వైకాపా ఎంపీ మోపిదేవి వెంకటరమణ అండదండలతో ఆయన కుటుంబ సభ్యులు జూదం మాఫియాను పోషిస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. జూద శిబిరాలను నియంత్రించి, నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం జగన్కు శనివారం ఆయన లేఖ రాశారు. ‘రేపల్లెలోని కృష్ణా పరిసరాల్లో జరుగుతున్న క్లబ్బులపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. మోర్తోట సమీపంలోని దిబ్బలు, ద్వీపాల్లో మోపిదేవి కుటుంబ సభ్యులు, పేటేరులో రేపల్లె 25వ వార్డు వైకాపా కౌన్సిలర్ జమీర్ ఆధ్వర్యంలో జూద శిబిరాలు నడుస్తున్నాయి. ఇక్కడి అసాంఘిక కార్యకలాపాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి