సంక్షిప్త వార్తలు(2)

రాష్ట్రంలో ఇటీవల మహిళలు, బాలికలపై లైంగిక దాడులు పెరిగిపోవడం ఆందోళనకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated : 05 Dec 2022 06:25 IST

మహిళలకు రక్షణ కల్పించాలి: తమ్మినేని

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇటీవల మహిళలు, బాలికలపై లైంగిక దాడులు పెరిగిపోవడం ఆందోళనకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం, మహిళా కమిషన్‌ వెంటనే స్పందించి బాధితులకు భద్రత, భరోసా కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు. దాడులకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు.


భాజపా జాతీయ పదాధికారుల భేటీకి రాష్ట్ర నేతలు

ఈనాడు, హైదరాబాద్‌: దిల్లీలో 5, 6 తేదీల్లో జరిగే భాజపా జాతీయ పదాధికారుల భేటీకి రాష్ట్ర నేతలు హాజరుకానున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రలో ఉన్న నేపథ్యంలో ఆయన స్థానంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి హాజరై నివేదిక ఇస్తారు. కె.లక్ష్మణ్‌, డీకే అరుణ, మురళీధర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితర నేతలు పాల్గొననున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని