సంక్షిప్త వార్తలు(2)
రాష్ట్రంలో ఇటీవల మహిళలు, బాలికలపై లైంగిక దాడులు పెరిగిపోవడం ఆందోళనకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మహిళలకు రక్షణ కల్పించాలి: తమ్మినేని
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల మహిళలు, బాలికలపై లైంగిక దాడులు పెరిగిపోవడం ఆందోళనకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం, మహిళా కమిషన్ వెంటనే స్పందించి బాధితులకు భద్రత, భరోసా కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు. దాడులకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
భాజపా జాతీయ పదాధికారుల భేటీకి రాష్ట్ర నేతలు
ఈనాడు, హైదరాబాద్: దిల్లీలో 5, 6 తేదీల్లో జరిగే భాజపా జాతీయ పదాధికారుల భేటీకి రాష్ట్ర నేతలు హాజరుకానున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ఉన్న నేపథ్యంలో ఆయన స్థానంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి హాజరై నివేదిక ఇస్తారు. కె.లక్ష్మణ్, డీకే అరుణ, మురళీధర్రావు, పొంగులేటి సుధాకర్రెడ్డి తదితర నేతలు పాల్గొననున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!