నాకు ప్రాణహాని ఉంది: వైఎస్ షర్మిల
ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన అనుచరుల నుంచి తనకు ప్రాణ హాని ఉందని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
ఈనాడు, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన అనుచరుల నుంచి తనకు ప్రాణ హాని ఉందని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ యాత్రకు అనుమతి ఇచ్చి తన పాదయాత్రను అడ్డుకోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్ లోటస్పాండ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఉన్నా పోలీసులు కావాలని షోకాజ్ నోటీసులు ఇచ్చి అడ్డుకుంటున్నారు. యాత్రలో ఎక్కడా మా పార్టీ శ్రేణులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించలేదు. బాధితులం మేము. పైగా మమ్మల్నే దోషులుగా చూపేందుకు పోలీసుల భుజంపై తుపాకిపెట్టి కాల్చే ప్రయత్నాలను తెరాస చేస్తోంది. కోర్టు ఇచ్చిన అనుమతుల ఉల్లంఘనపై ధిక్కరణ కేసు వేస్తాం. నేను ఎక్కడా వ్యక్తిగత దూషణలు చేయలేదు. హామీలు నెరవేర్చనందుకు ప్రజల తరఫున ఈ ప్రభుత్వానికే షోకాజ్ నోటీసు ఇవ్వాలి. ఒకటి రెండు రోజుల్లో పాదయాత్ర ప్రారంభిస్తా’ అని ఆమె వ్యాఖ్యానించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: అండమాన్ ఎక్స్ప్రెస్ ఇంజిన్కు చిక్కుకున్న మృతదేహం.. జమ్మికుంట స్టేషన్లో కలకలం
-
World News
Ukraine Crisis: యుద్ధట్యాంకుల సాయం ప్రకటన వేళ.. ఉక్రెయిన్పై 50కిపైగా క్షిపణి దాడులు
-
Movies News
Haripriya: ఒక్కటైన ‘కేజీయఫ్’ నటుడు, ‘పిల్ల జమీందార్’ నటి
-
Sports News
Ishan Kishan: నా బ్యాట్పై అతడి ఆటోగ్రాఫ్.. జీవితంలో మరచిపోలేని సందర్భం: ఇషాన్ కిషన్
-
Movies News
Rashmika: అలా చేస్తే ఎందులోనైనా విజయం సాధించవచ్చు..: రష్మిక
-
World News
Pakistan: భారత్తో రహస్య చర్చలు జరపడం లేదు : పాకిస్థాన్