నాటి బిహార్‌లా నేడు పుంగనూరు

పుంగనూరులో గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్‌ ఇంటిపై వైకాపా కార్యకర్తల దాడిని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.

Published : 06 Dec 2022 04:25 IST

తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పుంగనూరులో గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్‌ ఇంటిపై వైకాపా కార్యకర్తల దాడిని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఒకప్పటి బిహార్‌లా నేడు పుంగనూరు మారిందని మండిపడ్డారు. ‘‘డీజీపీ గారూ...నాలుగు జతల ఖాకీ దుస్తులు మీ స్థానిక అధికారులకు పంపండి. లేకపోతే రాష్ట్రంలో మొత్తం పోలీసు శాఖను మూసేశారనుకుంటారు...’’ అని పేర్కొంటూ సోమవారం చంద్రబాబు ట్వీట్‌ చేశారు. రామచంద్రయాదవ్‌ ఇంటి వద్ద వైకాపా కార్యకర్తలు సృష్టించిన విధ్వంసానికి సంబంధించిన వీడియోను తన ట్వీట్‌కు ఆయన జత చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు