కర్నూలులో హైకోర్టుకు భాజపా మద్దతు

కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు భాజపా మద్దతు ఉందని మాజీ ఎంపీ, భాజపా నాయకుడు టీజీ వెంకటేశ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 06 Dec 2022 04:25 IST

మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు భాజపా మద్దతు ఉందని మాజీ ఎంపీ, భాజపా నాయకుడు టీజీ వెంకటేశ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాయలసీమ డిక్లరేషన్‌కు భాజపా కట్టుబడి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో ఏపీ ఏ మాత్రం ఖర్చు చేసిందో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కర్నూలులో హైకోర్టు కోసం రాయలసీమ హక్కుల ఐక్యవేదిక 20 ఏళ్లుగా డిమాండ్‌ చేస్తోందని గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని