16న రాష్ట్రానికి జేపీ నడ్డా
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటనకు రానున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నవంబరు 29న చేపట్టిన అయిదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ఈ నెల 16న కరీంనగర్లో ముగియనుంది.
ఈనాడు, హైదరాబాద్: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటనకు రానున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నవంబరు 29న చేపట్టిన అయిదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ఈ నెల 16న కరీంనగర్లో ముగియనుంది. ఈ సందర్భంగా నిర్వహించే ముగింపు సభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరవుతారు. సంజయ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే పాదయాత్ర ముగియనుండటం, పార్టీ జాతీయ అధ్యక్షుడు రానుండటంతో భాజపా ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎస్ఆర్ఆర్ కళాశాలలో సభ నిర్వహించి భారీగా జనాన్ని సమీకరించాలని నిర్ణయించింది.
నడిచే దూరం పెంపు
పోలీసుల అనుమతి నిరాకరణ నేపథ్యంలో అయిదో విడత ప్రజాసంగ్రామ యాత్ర గత నెల 28కి బదులుగా 29న ప్రారంభమైంది. ముందు నిర్ణయించిన ప్రకారం 18న పూర్తికావాల్సి ఉంది. పార్టీ అధ్యక్షుడు 16న వచ్చేందుకు సమ్మతి తెలిపిన కారణంగా ఆ రోజుకు యాత్ర ముగించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు యాత్ర ప్రముఖ్ మనోహర్రెడ్డి తెలిపారు. అందుకనుగుణంగా సంజయ్ నడిచే కిలోమీటర్లసంఖ్యను పెంచుతున్నట్టు వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Turkey- syria Earthquake: అద్భుతం.. మృత్యుంజయులుగా బయటకొచ్చిన చిన్నారులు
-
India News
Cheetah: అవి పెద్దయ్యాక మనల్ని తినేస్తాయి.. మన పార్టీ ఓట్లను తగ్గించేస్తాయి..
-
Sports News
IND vs AUS: మూడో స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ని ఎంపిక చేయండి: రవిశాస్త్రి
-
Movies News
Kiara Sidharth Malhotra: ఒక్కటైన ప్రేమజంట.. ఘనంగా కియారా- సిద్ధార్థ్ల పరిణయం
-
Politics News
BJP: ప్రధాని మోదీపై రాహుల్ ఆరోపణలు నిరాధారం, సిగ్గుచేటు: రవిశంకర్ ప్రసాద్
-
World News
Turkey Earthquake: భూకంప విలయం.. రంగంలోకి శాటిలైట్లు!