దిల్లీ నగరపాలిక పీఠంపై ఆప్‌!

దిల్లీ నగరపాలక సంస్థ (ఎంసీడీ)లో 15 ఏళ్లుగా కొనసాగుతున్న భాజపా పాలనకు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) తెరదించబోతున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి.

Updated : 06 Dec 2022 06:23 IST

దిల్లీ: దిల్లీ నగరపాలక సంస్థ (ఎంసీడీ)లో 15 ఏళ్లుగా కొనసాగుతున్న భాజపా పాలనకు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) తెరదించబోతున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. ఎంసీడీకి ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆప్‌ ఘన విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. కాంగ్రెస్‌ ప్రభావం చాలా స్వల్పమని తెలిపాయి. నగర పాలికలో మొత్తం 250 వార్డులున్నాయి. ఇక్కడి ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని