భాజపా, తెరాసలను ఓడించేది బీఎస్పీనే
బహుజనులకు అణచివేత, మోసం అర్థమైన రోజు భాజపా, తెరాస పార్టీల పతనం మొదలుకావడం ఖాయమని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ అన్నారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్కుమార్
శామీర్పేట, న్యూస్టుడే: బహుజనులకు అణచివేత, మోసం అర్థమైన రోజు భాజపా, తెరాస పార్టీల పతనం మొదలుకావడం ఖాయమని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ అన్నారు. మంగళవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మూడు రోజుల పార్టీ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. బీఆర్ అంబేడ్కర్ పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రాష్ట్రంలో భాజపా, తెరాసలను ఓడించే ఏకైక పార్టీ బీఎస్పీనే అన్నారు. కార్యక్రమంలో పార్టీ చీఫ్ కో-ఆర్డినేటర్ మంద ప్రభాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయానందరావు, రాష్ట్ర కో-ఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్, మహిళా కన్వీనర్ అనితారెడ్డి, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?