ఖమ్మం సభతో తెదేపాకు పునరుత్తేజం: కాసాని

ఖమ్మం సభ రాష్ట్రంలో తెదేపా పునరుత్తేజానికి నాంది కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాష్ట్ర పర్యటనను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.

Published : 08 Dec 2022 04:50 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఖమ్మం సభ రాష్ట్రంలో తెదేపా పునరుత్తేజానికి నాంది కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాష్ట్ర పర్యటనను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈనెల 21న ఖమ్మంలో జరిగే సభకు సన్నాహక సమావేశాన్ని బుధవారమిక్కడ ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించారు. కాసాని మాట్లాడుతూ ఈ సభకు పరిసర నాలుగు జిల్లాల్లోని 18 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్ష మందికిపైగా ప్రజలు హాజరుకానున్నారని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని నేతలతో అన్నారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి,  పార్టీ తెలంగాణ వ్యవహారాల సమన్వయకర్త కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన సీఐటీయూ కార్మిక సంఘాల నేతలు శీతాల రోషపతి, మెరిగ దుర్గారావు, సాముల కోటమ్మ కాసాని జ్ఞానేశ్వర్‌ సమక్షంలో టీఎన్‌టీయూసీలో చేరారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని