Satyavathi Rathod: షర్మిల నాటకానికి సూత్రధారి నరేంద్రమోదీ: మంత్రి సత్యవతి రాథోడ్
వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇన్నిరోజులు ఆడిన నాటకానికి సూత్రధారి ప్రధాని నరేంద్రమోదీ అని తేటతెల్లమైందని రాష్ట్ర గిరిజన, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
డోర్నకల్, న్యూస్టుడే: వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇన్నిరోజులు ఆడిన నాటకానికి సూత్రధారి ప్రధాని నరేంద్రమోదీ అని తేటతెల్లమైందని రాష్ట్ర గిరిజన, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంపై విషం కక్కుతున్న మోదీ ఎమ్మెల్యేలను బేరమాడటానికి స్వామీజీలను పంపుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణకు రావాల్సిన పలు ప్రాజెక్టుల గురించి ఎన్నో పర్యాయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ సహా రాష్ట్ర మంత్రులు వెళ్లినా కనికరించని ప్రధానికి షర్మిలపై ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు. వార్డు మెంబర్ కూడా కాని షర్మిలకు ప్రధాని ఫోన్ చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ను తక్కువచేసి మాట్లాడితే తెలంగాణలోని ప్రజలకే కాదు రాళ్లకూ పవర్ ఉంటుందని తెలుసుకుని ఆమె మాట్లాడితే మంచిదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం