Jupally Krishna Rao: నేను ఏ పార్టీలో చేరాలో ప్రజలే నిర్ణయిస్తారు
తాను ఏ పార్టీలో చేరాలనేది ప్రజలే నిర్ణయిస్తారని మాజీ మంత్రి, తెరాస నేత జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పల్లెపల్లెకూ వెళ్తానన్నారు.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు
అచ్చంపేట న్యూటౌన్, న్యూస్టుడే: తాను ఏ పార్టీలో చేరాలనేది ప్రజలే నిర్ణయిస్తారని మాజీ మంత్రి, తెరాస నేత జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పల్లెపల్లెకూ వెళ్తానన్నారు. ప్రజలే కేంద్ర బిందువుగా, వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు చేస్తానన్నారు.అప్పుడు పదవులు వాటంతట అవే వస్తాయన్నారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ‘జూపల్లి మరో ప్రస్థానం’ పేరిట బుధవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజలు ఆశించిన లక్ష్యాలు నెరవేరడం లేదని కృష్ణారావు విమర్శించారు. కొల్లాపూర్లో 1,600 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసినా ఆర్డీవోపై చర్యలు తీసుకోలేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్