జీతాలు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రం
రూ.లక్షల కోట్ల అప్పులు చేస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు
ఈనాడు, దిల్లీ: రూ.లక్షల కోట్ల అప్పులు చేస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. దిల్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులకు ఏడు డీఏలను రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉందని, వాటికే రూ.12 వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. తమకు పింఛను ఇవ్వలేదని విశ్రాంత ఐఏఎస్ అధికారులు డీవోపీటీకి లేఖలు రాశారని ఆయన తెలిపారు. ఇప్పటికే రూ.8.70 లక్షల కోట్ల అప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఓ కార్పొరేషన్ పేరిట రూ.2 వేల కోట్లు అప్పు చేసినట్లు తెలిసిందన్నారు. రాష్ట్రంలో 18 టన్నుల మాదకద్రవ్యాలు పట్టుకున్నారని, దేశవ్యాప్తంగా కూడా ఇంత మొత్తాన్ని పట్టుకోలేదన్నారు. బీసీలకు ఎంతో చేశామని చెబుతున్న జగన్మోహన్రెడ్డి పార్లమెంట్ కమిటీల్లో ఏ ఒక్క కీలక పదవి బీసీ నేతలకు ఇవ్వలేదని మండిపడ్డారు. పార్లమెంటరీ పార్టీ, రాజ్యసభ పక్ష నేత, టూరిజం ట్రాన్స్పోర్ట్ కమిటీ ఛైర్మన్, ఎథిక్స్ కమిటీ ఛైర్మన్, రాజ్యసభ ప్యానల్ ఛైర్మన్ పదవులన్నింటినీ విజయసాయిరెడ్డికే అప్పగించారని రఘురామ పేర్కొన్నారు. మాజీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్య వంటి బీసీ నేతలు ఉన్నా రాజ్యసభ కమిటీల్లో వారికి అవకాశం ఇవ్వకుండా అన్ని పదవులు విజయసాయిరెడ్డికే కట్టబెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు