‘షర్మిల మోదీ ఏజెంట్‌’

వైతెపా అధ్యక్షురాలు షర్మిల భాజపాతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని, తెలంగాణలో ఉంటూ ప్రధాని మోదీకి ఏజెంట్‌గా పనిచేస్తున్నారని తెరాస ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్‌రావు, నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ ధ్వజమెత్తారు.

Published : 09 Dec 2022 05:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: వైతెపా అధ్యక్షురాలు షర్మిల భాజపాతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని, తెలంగాణలో ఉంటూ ప్రధాని మోదీకి ఏజెంట్‌గా పనిచేస్తున్నారని తెరాస ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్‌రావు, నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ ధ్వజమెత్తారు. తెలంగాణలో అల్లర్ల కోసం ఆమె కుట్ర చేస్తున్నారని, ఇందులో భాజపా ప్రధాన పాత్ర పోషిస్తోందని ఆరోపించారు. భాజపాకు వ్యతిరేకంగా వైఎస్‌ పోరాడితే.. ఆ పార్టీ పంచన చేరి షర్మిల ఆయన పరువు తీస్తోందని విమర్శించారు. గురువారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. ‘‘ఏపీ నుంచి వచ్చిన షర్మిల తెలంగాణలో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టాలని ప్రయత్నించడం సరికాదు. ఆమె అర్థం లేని విమర్శలు ఆపాలి’’ వారు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని