సీట్ల సర్దుబాటుపై హస్తం కుస్తీ
నాలుగు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి జరగనున్న శాసనసభ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ తహతహలాడుతున్నా.. ...
ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లవర్షం కురిపిస్తుందని ఆశ
దిల్లీ: నాలుగు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి జరగనున్న శాసనసభ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ తహతహలాడుతున్నా.. మిత్ర పక్షాలతో సీట్లను సర్దుబాటు చేసుకోవడం కీలకంగా మారింది. వ్యవసాయ, పౌరసత్వ సవరణ చట్టాలకు వ్యతిరేకంగా ప్రజల్లో వెల్లువెత్తుతున్న నిరసనలతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈసారి తమకు కలిసివస్తుందని కాంగ్రెస్ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. కేరళను మినహాయిస్తే అసోం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిలలో మిత్రపక్షాలతో ఎదురవుతున్న సమస్యల్ని ఆ పార్టీ పరిష్కరించుకోవాల్సి ఉంది. బెంగాల్లో కొత్తగా ఏర్పాటైన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. ముస్లిం వర్గాల ఓట్ల కోసం ఈ ఫ్రంట్తో కలిసి వెళ్లాలని కాంగ్రెస్-వామపక్ష కూటమి భావిస్తోంది. అటు అసోంలో ఏఐయూడీఎఫ్తో ఒప్పందం ఖరారు కావాల్సి ఉంది. బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని ఈ ఫ్రంట్ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రధాన భాగస్వామి. తమిళనాడులో అధికార అన్నాడీఎంకేను గద్దె దించడానికి పూర్తిగా డీఎంకేపై కాంగ్రెస్ ఆధారపడుతోంది. ఈసారి తమకు 50కి పైగా స్థానాలు ఇవ్వాలని ఆ పార్టీ కోరుతున్నా.. దానికి డీఎంకే సుముఖంగా లేదు. కాంగ్రెస్ గతసారి ఎన్నికల్లో 41 స్థానాల్లో పోటీచేసి కేవలం 8 చోట్ల గెలవడం, ఇటీవలి ఎన్నికలను చూసినా ఓట్ల పరంగా రాణించలేకపోవడం వంటి కారణాల వల్ల ఈసారి తక్కువ స్థానాలే ఇస్తామని డీఎంకే అంటోంది. పుదుచ్చేరిలో మాత్రం ఎవరితో కలిసి వెళ్లాలనేది హస్తం తేల్చుకోలేకపోతోంది. ఇటీవల అక్కడ ప్రభుత్వం కుప్పకూలిపోవడం, భాజపా దూకుడు మీద ఉండడంతో కాంగ్రెస్కు సరైన భాగస్వామి దొరకడం లేదు.
కనీసం ఒక రాష్ట్రంలోనైనా..
శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని తిరిగి నింపడానికి కనీసం ఒక రాష్ట్రంలోనైనా పూర్తిస్థాయిలో గెలుపు సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. పార్టీ అగ్రనేతగా రాహుల్గాంధీ విశ్వసనీయతని పెంచడానికి ఈ ఎన్నికలను ఒక సాధనంగా చేసుకునే అవకాశాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీ అధినాయకత్వంపై కొందరు సీనియర్లు వ్యక్తం చేస్తున్న భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ఈ ఎన్నికలు కీలకమని వారు పేర్కొంటున్నారు. ప్రతి ఐదేళ్లకోసారి అధికారం చేతులు మారుతుండే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈసారి అధికారం తమకు దక్కుతుందని కాంగ్రెస్ వ్యూహకర్తలు ఆశాభావంతో ఉన్నారు. వచ్చే ఏడాది ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ శాసనసభలకు జరిగే ఎన్నికల్లో విజయం సాధించాలన్నా ప్రస్తుత ఎన్నికలు కీలకమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్