తెలంగాణ కాంగ్రెస్లో ప్రతి ఒక్కరూ ప్రశాంత్ కిశోర్లే: జగ్గారెడ్డి
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. శుక్రవారం
గాంధీభవన్, న్యూస్టుడే: కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియాహాలులో విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్గాంధీపై ప్రశాంత్ కిశోర్ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్కు ఆయన సేవలు అక్కర్లేదని, తెలంగాణ కాంగ్రెస్లో ప్రతి కార్యకర్తా ప్రశాంత్ కిశోరేనని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్థానిక సంస్థల ఓటర్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ బెదిరించిన ఆడియోను జగ్గారెడ్డి మీడియా ముందు వినిపించారు. ఆడియో బయటికి వచ్చినా మంత్రిపై ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్