భాజపాను ఓడించాలంటే.. కాంగ్రెస్ను కలుపుకొని పోవాల్సిందే..
దేశంలో భాజపాను ఓడించాలంటే కాంగ్రెస్ను కలుపుకొని పోవాల్సిన అవసరముందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కలలుకంటున్న మూడోఫ్రంట్తో ఉపయోగం ఉండదన్నారు. కేసీఆర్
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
కవాడిగూడ, న్యూస్టుడే: దేశంలో భాజపాను ఓడించాలంటే కాంగ్రెస్ను కలుపుకొని పోవాల్సిన అవసరముందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కలలుకంటున్న మూడోఫ్రంట్తో ఉపయోగం ఉండదన్నారు. కేసీఆర్ నిజంగానే భాజపాకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లయితే.. భావసారూప్యత కలిగిన పార్టీలను ఎందుకు కలుపుకుపోవడం లేదని ప్రశ్నించారు. రాజధానిలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 22 నుంచి 25 వరకు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్లో నిర్వహించే సీపీఎం రాష్ట్ర తృతీయ మహాసభలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులను మనోవేదనకు గురి చేస్తున్న జీవో 317 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ‘మన ఊరు-మన బడి’ పథకాన్ని ప్రకటించి వదిలేయకుండా, అమలు చేసి చూపాలన్నారు. పాఠశాలల్లో ఆంగ్లంతో పాటు తెలుగు మాధ్యమం కొనసాగాలన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి.జ్యోతి, బి.వెంకట్, నంద్యాల నరసింహారెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ