మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా పోరాటం
కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపడమే లక్ష్యంగా భారత కమ్యునిస్టు పార్టీ(మార్కిస్టు) పోరాడుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉద్ఘాటించారు. పార్టీ రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా శనివారం
భాజపాతో దేశానికి.. ప్రజాస్వామ్యానికి ప్రమాదం
సీపీఎం మహాసభలో ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
ఈనాడు, హైదరాబాద్: కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపడమే లక్ష్యంగా భారత కమ్యునిస్టు పార్టీ(మార్కిస్టు) పోరాడుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉద్ఘాటించారు. పార్టీ రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా శనివారం సాయంత్రం నిర్వహించిన ఆన్లైన్ మహాసభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ప్రజా ఉద్యమాలను బలపరచడం ద్వారానే ఇది సాధ్యం. పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో పార్టీశాఖలు నిర్ణయం తీసుకుంటాయి. కలిసి పోరాడితే ప్రజల్ని ఓడించగలిగేవారు లేరనేది ఇటీవల రైతు ఉద్యమం చాటిచెప్పింది. ప్రధాని మోదీ దిగిరాక తప్పలేదు. రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద, మత సామరస్యంపైన జరుగుతున్న దాడులను, దోపిడీని ఎదుర్కోవాలంటే ప్రజా ఉద్యమాలే సరైన మార్గం. దీనికోసం ఎలాంటి ఎత్తుగడ అనుసరించాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. దేశంలో అందరికీ రెండు డోసులు వ్యాక్సిన్ వేస్తే ప్రజలు కరోనా నుంచి బయటపడే అవకాశం ఉన్నా కేంద్రం చేతులు ఎత్తేసింది. దేశ సంపదంతా లూటీ అవుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోంది. దేశంలో కోటీశ్వరుల వద్ద ఉన్న సంపద విలువ 55.5 శాతం దేశ ప్రజల సంపదతో సమానం. ప్రపంచ స్థాయి ప్రమాణాల ప్రకారం దేశంలో ఆకలి, పేదరికం సూచీలు పడిపోతున్నాయి. ఎనిమిదేళ్లలో సామూహిక అత్యాచారాలు, మహిళలపై దాడులు, హత్యలు చోటుచేసుకున్నా సరైన నివారణ చర్యలు లేవు. వ్యవసాయం, విద్య, సహకార, విద్యుత్ తదితర వ్యవస్థలపై రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారు. పార్లమెంటును రబ్బరు స్టాంపుగా మార్చారు. సీబీఐ, ఈడీలను స్వార్థానికి వాడుకుంటూ ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయిస్తున్నారు’’ అంటూ సీతారాం ఏచూరి విమర్శించారు. పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు బృందా కారాట్ మాట్లాడుతూ.. పోరాటాలతోనే ఏదైనా సాధ్యమనేది అంతా గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సీతారాములు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
పలు అంశాలపై చర్చ, తీర్మానాలు
భారత కమ్యునిస్టు పార్టీ(మార్క్సిస్టు) రాష్ట్ర మూడో మహాసభలు మంగళవారం వరకు జరగనున్నాయి. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో నిర్వహించనున్న ఈ సభల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారాట్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోపాటు కేంద్ర కమిటీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాల నుంచి 640 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సభల్లో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు ఆమోదించనున్నారు.
ప్రజా తెలంగాణయే సీపీఎం లక్ష్యం
తెలంగాణ ఆవిర్భావం తరువాత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పాలకులు బంగారు తెలంగాణ నిర్మిస్తామని వాగ్దానం చేసినా నెరవేర్చలేదు. ప్రజా తెలంగాణ సాధించడం ఎలా అనేదానిపై పార్టీ ఆలోచన చేస్తోంది. కేంద్రంపై యుద్ధం ప్రకటించకపోతే ప్రజల ప్రయోజనాలకు రక్షణ కష్టం. కాంగ్రెస్ సరైన తీరులో స్పందించడం లేదు.
- బీవీ రాఘవులు, పొలిట్బ్యూరో సభ్యుడు
రాష్ట్రంలో విషసర్పంలా భాజపా
రాష్ట్రంలో భాజపా విషసర్పంలా ఎదుగుతోంది. దేశంతో పాటు ఈ రాష్ట్రంలోనూ సీపీఎంకు భాజపాయే ప్రధాన రాజకీయ శత్రువు. మరోమారు ప్రజాతంత్ర శక్తులను సమీకరిస్తాం. భాజపా దాడి కేవలం కమ్యునిస్టులపైనే కాదు తెరాసపైనా ఉంది. అయినా సీఎం కేసీఆర్ పోరాటం చేయడం లేదు. భాజపాతో బేరసారాలు ఆడుకోవడానికి అధికారాన్ని వాడుకుంటున్నారు. ఆయనతో ఎన్నికల పొత్తు పెట్టుకోం.
- తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల