UP: మేం గెలిస్తే ఇద్దరు సీఎంలు: యూపీలో ఒవైసీ హామీ
ఎన్నికల వేళ.. ఉత్తర్ప్రదేశ్లో ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. కొత్త కూటమి ప్రకటించారు. జన్ అధికార్ పార్టీ, బీఏఎంసీఈఎఫ్లతో కలిసి ‘భాగీదారీ పరివర్తన్ మోర్చా’ను ఏర్పాటు చేస్తునట్లు శనివారం తెలిపారు.
లఖ్నవూ: ఎన్నికల వేళ.. ఉత్తర్ప్రదేశ్లో ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. కొత్త కూటమి ప్రకటించారు. జన్ అధికార్ పార్టీ, బీఏఎంసీఈఎఫ్లతో కలిసి ‘భాగీదారీ పరివర్తన్ మోర్చా’ను ఏర్పాటు చేస్తునట్లు శనివారం తెలిపారు. తమ కూటమిని గెలిపిస్తే ఐదు సంవత్సరాల కాలంలో ఓబీసీ నుంచి ఒకరు, దళితుల నుంచి ఒకరు ముఖ్యమంత్రులుగా ఉంటారని పేర్కొన్నారు. అలాగే ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని, అందులో ఒకరు ముస్లిం వర్గానికి చెందిన వారిని ఎంపిక చేస్తామని తెలిపారు. కూటమికి జన్ అధికార్ పార్టీ అధ్యక్షుడు బాబు సింగ్ కుశ్వాహా నేతృత్వం వహిస్తారని ప్రకటించారు. బాబు సింగ్ గతంలో మాయావతి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ